అమరావతి వెళ్లాలా... వద్దా : సాయంత్రం నిర్ణయం | Sakshi
Sakshi News home page

అమరావతి వెళ్లాలా... వద్దా : సాయంత్రం నిర్ణయం

Published Sun, Oct 18 2015 12:23 PM

అమరావతి వెళ్లాలా... వద్దా : సాయంత్రం నిర్ణయం - Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లాలా... వద్దా అనేది సాయంత్రం నిర్ణయిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లో విలేకర్లు... రాజధాని శంకుస్థాపనకు వెళ్తున్నారా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్  పై విధంగా స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. అందుకోసం ఆదివారం సాయంత్రం కేసీఆర్ నివాసానికి చంద్రబాబు రానున్న సంగతి తెలిసిందే. ఓ వేళ కేసీఆర్... రాజధాని శంకుస్థాపనకు వెళ్తే... తెలంగాణలో పేద ప్రజల కోసం నిర్మించిన ఐడీఎల్ కాలనీలోని నిర్మించిన డబుల్ బెడ్రూం ప్లాట్ల కార్యక్రమం వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం కూడా దసర పండగనాడే ప్రారంభంకానుంది.

Advertisement
Advertisement