చెన్నై: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే (అమ్మ) అధినేత్రి వీకే శశికళకు మరిన్ని కష్టాలు చుట్టుముట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకే (అమ్మ) నేతలు భారీగా ఓటర్లకు డబ్బులు పంచిందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకమైన ఆర్కే నగర్ ఉప ఎన్నికను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీగా ఆమె నియామకం ఎంతవరకు చెల్లుతుందనే అంశాన్ని ఈసీ పరిశీలించనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా శశికళ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె నియామకం ఎంతవరకు ప్రామాణికం అన్న విషయాన్ని పరిశీలించిన తర్వాతే.. ఆర్కే నగర్ ఉప ఎన్నిక తేదీలను ప్రకటించాలని ఈసీ భావిస్తున్నదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘ఎన్డీటీవీ’ పేర్కొంది.
రాజకీయంగా అత్యంత కీలకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక కోసం రూ. 89 కోట్ల మేరకు ఓటర్లకు శశికళ వర్గం పంచిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఈఎన్నికను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం అన్నాడీఎంకేకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకు నగదును ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది.
చిన్నమ్మకు మరిన్ని కష్టాలు??
Published Mon, Apr 10 2017 11:24 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement