నాటు బాంబు పేలి, 8 మంది దుర్మరణం | Sakshi
Sakshi News home page

నాటు బాంబు పేలి, 8 మంది దుర్మరణం

Published Fri, Apr 21 2017 7:37 PM

Eight killed in crude bomb explosion in West Bengal

కోల్‌కతా: పశ్చమబెంగాల్‌లోని బీర్బుం జిల్లా దర్బార్‌పూర్‌ గ్రామంలో నాటు బాంబు పేలడంతో ఎనిమిది మంది మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. శుక్రవారం నాటుబాంబులను తయారు చేస్తుండగా, అవి పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది.

లబ్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని దర్బార్‌పూర్‌ గ్రామం వెలుపల ఓ ముఠా నాటు బాంబులు తయారు చేస్తుండగా అవి పేలినట్టు బీర్చుం జిల్లా ఎస్పీ ఎన్‌ సుధీర్‌ కుమార్‌ చెప్పారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా చనిపోయినట్టు తెలిపారు. స్థానికంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతోందని, ఓ వర్గం వారు ఈ బాంబులను తయారు చేసేందుకు ప్రయత్నించారని, మృతులను గుర్తించినట్టు ఎస్పీ చెప్పారు. గాయపడినవారు బుర్ద్వాన్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement