న్యూఢిల్లీ: తండ్రీకొడుకుల సైకిల్ పంచాయితీలో ఎట్టకేలకు తీర్పు వచ్చింది. సమసమాజ్వాదీ పార్టీ ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్కే సైకిల్ గుర్తును కేటాయించింది. ఈ మేరకు ఈసీ మరికాసేపట్లో అధికారిక ప్రకటన చేయనుంది.
పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మద్దతుతో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్ యాదవ్.. సైకిల్ గుర్తును కూడా తనకే కేటాయించాలని ఈసీని ఆశ్రయించడం తెలిసిందే. కొడుకు తిరుగుబాటును గుర్తించని తండ్రి ములాయం సింగ్ యాదవ్ సైతం పార్టీ గుర్తుపై ఈసీని ఆశ్రయించారు. ఒకదశలో సైకిల్ గుర్తును రద్దుచేసి, ఇరు వర్గాలకు రెండు వేరువేరు గుర్తులు ఇస్తారని ప్రచారంసాగింది. కానీ చివరికి సైకిల్ గుర్తు అఖిలేశ్ కే దక్కింది. గుర్తు కేటాయింపుపై నిబంధనలు, గతంలో ఇచ్చిన తీర్పులను క్షుణ్నంగా పరిశీలించిన మీదట నిర్ణయం తీసుకుంటామని సీఈసీ జైదీ పేర్కొన్నారు.
(అఖిలేశ్దే సైకిల్ - ఈసీ ఉత్తర్వులు: ఇక్కడ క్లిక్ చేయండి)
వేగంగా మారుతోన్న రాజకీయాలు..
ఈసీ నిర్ణయం వెలువడగానే అఖిలేశ్ వర్గీయుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఢిల్లీ, లక్నో సహా యూపీ అంతటా కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. అఖిలేశ్కు సైకిల్ గుర్తు పక్కా కావడంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అఖిలేశ్ వర్గంలో కీలక నేత రాంగోపాల్ యాదవ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మహాకూటమి ఏర్పాటు ఖాయమని అన్నారు. సమాజ్వాదీ పార్టీ నేతృత్వంలో కాంగ్రెస్, ఆర్ఎల్డీ, ఆర్జేడీ పార్టీలతో మహా కూటమిని ఏర్పాటుచేస్తామని, ఈ మేరకు అవసరమైన చర్చలు ప్రారంభమయ్యాయని రాంగోపాల్ తెలిపారు.
అఖిలేశ్కే సైకిల్ గుర్తు
Published Mon, Jan 16 2017 7:02 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement