కార్మికుల సమ్మెకు ఉద్యోగుల మద్దతు | Sakshi
Sakshi News home page

కార్మికుల సమ్మెకు ఉద్యోగుల మద్దతు

Published Wed, Aug 19 2015 1:12 AM

Employees support workers to strike

సెప్టెంబర్ 2న ధర్నాలు

 హైదరాబాద్: అఖిల భారత కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2న తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) తీర్మానించింది. కాంట్రాక్టు, కంటింజెన్సీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో రాష్ట్రప్రభుత్వం చేస్తున్న జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం నెల్లూరులో జరిగిన జేఏసీ సమావేశంలో చేసిన తీర్మానాలు, చర్చించిన అంశాల్ని జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు, సెక్రటరీ జనరల్ ఐ.వెంకటేశ్వరరావు, సహాధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మంగళవారం సచివాలయంలో మీడియాకు వెల్లడించారు.

‘‘అఖిల భారత కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెకు మద్దతుగా వచ్చేనెల 2న  అన్ని డివిజనల్, మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలు ధరించి రోజంతా ధ ర్నా నిర్వహించాలని జేఏసీ  నిర్ణయించింది. ఈ నెల 26న విశాఖపట్నం, 27న కాకినాడ, 29న గుంటూరు, 31న కడపలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది’’ అని అశోక్‌బాబు తెలిపారు. స్థానికతపై ఉద్యోగులకు స్పష్టతనివ్వాలని న్యాయశాఖ కార్యదర్శిని కోరామన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement