దశలవారీగా ఉద్యోగుల తరలింపు | Sakshi
Sakshi News home page

దశలవారీగా ఉద్యోగుల తరలింపు

Published Fri, Sep 11 2015 3:02 AM

Employees to migrate on state wide

కమిటీతో ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీక్ష
 సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధానికి దశలవారీగా ఉద్యోగులను తరలించేందుకు  సర్కారు కసరత్తు చేస్తోంది. గురువారం రాజధాని ఉద్యోగుల తరలింపు కమిటీ సభ్యులు శ్యాంబాబు తదితరులతో సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వచ్చే విద్యా సంవత్సరానికల్లా కనీసం 2 వేల నుంచి 3 వేల మంది ఉద్యోగులను హైదరాబాద్ నుంచి తరలించాలని నిర్ణయించారు. అయితే స్థానికత విషయం తేలేవరకూ కొత్త రాజధానికి ఎలా వెళతామని ఏపీ ఎన్జీవో ఉద్యోగుల సంఘం సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement
Advertisement