న్యూఢిల్లీ: ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ బుధవారం ఢిల్లీలో ఐఐటీ విద్యార్థులతో ముచ్చటించనున్నారు. ఢిల్లీ ఐఐటీలో ఏర్పాటుచేయనున్న టౌన్హాల్ మీటింగ్లో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 900 మంది విద్యార్థులు పాల్గొనే అవకాశముంది. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు జూకర్బర్గ్ సమాధానం ఇవ్వనున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్ అయిన ఫేస్బుక్కు భారత్లో 13 కోట్లమంది యూజర్లు ఉన్నారు. యూజర్ల పరంగా భారత్ రెండోస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఐఐటీలో బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు క్వశ్చన్-ఆన్సర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు మార్క్ జూకర్బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఇదే తరహా టౌన్హాల్ మీటింగ్ ను కాలిఫోర్నియాలోని ఫేస్బుక్ క్యాంపస్లో నిర్వహించారు. ఆ సమయంలో అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సమావేశం కోసం భారత పర్యటనకు వచ్చిన మార్క్ జూకర్బర్గ్ మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహాల్ను సందర్శించారు. ఈ సందర్భంగా తాజ్ మహాల్ ఫొటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసి.. అత్యద్భుతమని వ్యాఖ్యానించారు.
నేడు ఢిల్లీలో జూకర్బర్గ్ మాటాముచ్చట..
Published Wed, Oct 28 2015 9:05 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
Advertisement