అకాల వర్షం.. ఆగిన అన్నదాతల గుండె | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. ఆగిన అన్నదాతల గుండె

Published Sun, Apr 12 2015 1:20 PM

Farmer dies of cardiac arrest over crop loss

ముజాఫ్పార్ నగర్: అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంలా మారాయి. ఉత్తరప్రదేశ్ లో  భారీగా కురిసిన వడగండ్ల వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగండ్ల వాన సృష్టించిన బీభత్సానికి కళ్లముందే కష్టపడి పండించిన పంటలన్నీ నేలపాలయ్యాయి. అదిచూసిన అన్నదాతల గుండె పగిలిపోయింది. చేతికొచ్చిన పంటలు నీటిపాలవ్వడంతో  మనస్తాపం చెందిన ముగ్గురు రైతులు గుండెపోటుతో మృతిచెందారు. మృతుల్లో దుర్గంధాపూర్  గ్రామ రైతు సుక్బీర్ (57), సిక్రీ గ్రామ రైతు రషీద్ ఖాన్ (60), మోద్ పూర్ రాయ్ సింగ్ ప్రాంత రైతు ఖీమ్ చంద్ (75) ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement