ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు | Sakshi
Sakshi News home page

ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు

Published Sun, Mar 2 2014 6:25 PM

ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు: ఏప్రిల్ 7 నుంచి ఎన్నికలు - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ విషయమై ఈసి అధికారులు కేంద్ర హోంశాఖ అధికారులతో విస్తృత స్థాయిలో చర్చలు జరుపుతున్నారు. రెండు మూడు రోజులలో ఎన్నికల షెడ్యూల్కు తుదిరూపం తీసుకువస్తారు.  

 దేశవ్యాప్తంగా మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు.  ఏప్రిల్ 2వ వారం నుంచి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 7-10 మధ్య మొదటి విడత పోలింగ్ జరుగుతుందని  ఈసీ వర్గాల సమాచారం.  బుధవారం లేదా గురువారం ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తారు.  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో లోక్‌సభతో పాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు.

Advertisement
Advertisement