మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు | Sakshi
Sakshi News home page

మందుపాతర పేలి ఐదుగురు జవాన్లకు గాయాలు

Published Sun, Feb 9 2014 3:09 PM

Five jawans injured in landmine blast by Naxals in Chhattisgarh

ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. భేజి పోలీసు స్టేషన్ పరిధిలోని బోధ్రాజ్పూర్ గ్రామ సమీపంలో ఉన్న అడవుల్లో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు సుక్మా జిల్లా అదనపు ఎస్పీ నీరజ్ చంద్రకర్ తెలిపారు. సీఆర్పీఎఫ్తో పాటు మావోయిస్టుల అణచివేతకు ప్రత్యేకంగా ఏర్పాటైన కోబ్రా దళం, జిల్లా పోలీసులు కలిసి సంయుక్తంగా ఈ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు.

ఇది రాష్ట్ర రాజధాని రాయ్పూర్కు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బలగాలు కూంబింగ్ చేస్తున్న విషయాన్ని పసిగట్టిన మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో పాటు భద్రతాదళాలపై కాల్పులు కూడా జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అయితే భద్రతాదళాలు కూడా తిరిగి కాల్పులు జరపడంతో మావోయిస్టులు వెనుదిరిగారు. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించేందుకు హెలికాప్టర్లను పంపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement