న్యూఢిల్లీ: అదరగొట్టే ఆఫర్లతో ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ మోటరోలా లాంచ్ చేసిన తాజా స్మార్ట్ఫోన్ మోటో జీ5 ప్లస్ విక్రయాల్లో దూసుకుపోయింది. దేశీయ అతిపెద్ద కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మెటోజీ ప్లస్ విక్రయాల్లో రికార్డు సృష్టించింది. లాంచ్ అయిన మొదటి రోజే భారీ అమ్మకాలతో రికార్డు క్రియేట్ చేసింది. ఆన్లైన్ మార్కెట్లో ప్రవేశపెట్టిన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుబోయి.. ఔట్ ఆఫ్ స్టాక్ గా నిలిచింది.
మార్చి 15న అర్ధరాత్రి ప్రారంభమైన అమ్మకాల్లో ప్రారంభ మొదటి కొన్ని నిమిషాల్లోనే మోటో జీ5 ప్లస్ 3జీబీ /16జీబీ వేరియంట్ హాట్ సేల్ ను సాధించిందని ఫ్లిప్కార్ట్ డైరెక్టర్ అయ్యప్పన్ ఆర్ తెలిపారు. నిమిషానికి 50 యూనిట్లను విక్రయించినట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఎక్సేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ తోపాటు తాము లాంచ్ చేసిన బై బ్యాక్ గ్యారంటీ ప్రోగ్రాం ఈ రికార్డు అమ్మకాలకు కారణమని చెప్పారు. అటు అద్భుతమైన స్పందన లభించిన ఈ స్మార్ట్ ఫోన్ రేటింగ్ లో 90శాతం ఫైవ్ స్టార్ రేటింగ్ సాదించినట్టు చెప్పారు. నో కాస్ట్ ఈఎంఐ కింద 50శాతం విక్రయాలు, మిగిలిన విక్రయాలను ఎక్సేంజ్, బై బ్యాక్ గ్యారంటీ పథకం ద్వారా సాధించినట్టు చెప్పారు.
మోటో జీ 5 ప్లస్ ఫీచర్లు
5.2 అంగుళాల టచ్స్క్రీన్
2 గిగాహెడ్జ్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్,
12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3,000 ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా మోటీజీ 5 ప్లస్ పై 4వేల ఎక్సేంజ్ ఆఫర్, కొనుగోలు చేసిన ఆరు నెలల్లో బై బ్యాక్ గ్యారంటీడ్ ఆఫర్ చేసింది. మార్చి 31 వరకు ఈ పథకం చెల్లుబాటులో ఉంటుందని లాంంచింగ్ సందర్భంగా ప్రకటించింది. ఈ స్మార్ట్ఫోన్ 3జీబీ ర్యామ్, 16జీబీ మెమొరీతో రెండు వేరియంట్లలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.