సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కన్నుమూత | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కన్నుమూత

Published Sun, Feb 19 2017 12:09 PM

సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ కన్నుమూత

కోల్‌కతా: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్తామస్ కబీర్ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు.

1948లో కోల్‌కతాలో జన్మించిన కబీర్.. సుప్రీం కోర్టు 39వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 సెప్టెంబర్ 29 నుంచి 2013 జూలై 18 వరకు ఆయన ఈ పదవిలో ఉన్నారు. అంతకుముందు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

Advertisement
Advertisement