'బుకాయించడం బాబుకే చెల్లింది' | Sakshi
Sakshi News home page

'బుకాయించడం బాబుకే చెల్లింది'

Published Thu, Jun 18 2015 12:24 PM

'బుకాయించడం బాబుకే చెల్లింది' - Sakshi

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి గురువారం కడపలో నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదశ్ పరువు - ప్రతిష్టను మంటగలిపారని ఆరోపించారు. ఓటుకు నోటు వ్యవహారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికినా బుకాయించడం బాబుకే చెల్లిందని విమర్శించారు.

అధికారం చేపట్టిన ఏడాదికి హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజల రక్షణ బాబుకు గుర్తొచ్చిందంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు పరిపాలిస్తున్న రాష్ట్రంలోనే ప్రజలుకు రక్షణ లేదని శ్రీకాంత్రెడ్డి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement