ఏఐబీపీ కింద దేవాదులకు రూ.350 కోట్లు
మిషన్ కాకతీయకు రూ.180 కోట్లు
త్వరగా విడుదల చేయాలంటూ 6న ఢిల్లీకి అధికారులు
హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయడానికి కేంద్ర పథకాల నుంచి అందాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. సత్వర సాగునీటి ప్రయోజన కార్యక్రమం(ఏఐబీపీ), మరమ్మతు, నవీకరణ, పునరుద్ధరణ(ట్రిపుల్ఆర్) కింద రాష్ట్రాలకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వం కొత్తగా చేపడుతున్న జల్ క్రాంతి అభియాన్, ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన(పీఎంకేఎస్వై) నుంచి ఎక్కువ మొత్తంలో నిధులను రాష్ట్రానికి ఇవ్వాలని కోరేందుకు సిద్ధమైంది. ఈ నెల 6న ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి హాజరై నిధుల అంశాన్ని ముందుపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. పీఎంకేఎస్వై పథకం కింద రానున్న ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నిధులు కేటాయించేందుకు సిద్ధమని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. ఈ పథకం అమలుతో పాటు రాష్ట్రాల భారీ, మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల పరిధిలోని స్థితిగతులను అంచనా వేసేందుకు కేంద్రం వచ్చే గురువారం ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పీఎంకేఎస్వై పరిధిలోకే అన్ని కేంద్ర పథకాలను తీసుకొచ్చి నిధుల అవసరాలను గుర్తించేందుకు నిర్ణయించింది.
దీనికి రాష్ట్రం తరఫున అధికారులు హాజరుకానున్నారు. కేంద్రం ముందు పెట్టాల్సిన అంశాలపై కసరత్తు సైతం పూర్తి చేశారు. ప్రాథమికంగా తెలిసిన సమాచారం మేరకు.. ఏఐబీపీ కింద ఇప్పటికే దేవాదుల ప్రాజెక్టుకు మూడు విడతలుగా రావాల్సిన నిధులు కలిపి రూ.396 కోట్ల వరకు రావాల్సి ఉంది. వీటిని విడుదల చేయాలని కోరడంతో పాటు, నిజాంసాగర్ ఆధునికీకరణ, ఎస్సారెస్పీ వరద కాల్వ, కొమరంభీమ్ వంటి ప్రాజెక్టులను కొత్తగా ఏఐబీపీలో చేర్చాలని ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి విన్నవించనుంది. మిషన్ కాకతీయ పనులకు ట్రిపుల్ ఆర్ కింద కేంద్రం రూ.వె య్యి కోట్లు ఇచ్చేందుకు సమ్మతి తెలిపినందున అందులో తొలి విడతగా రూ.180 కోట్ల నిధులను విడుదల చేయాలని కోరనుంది.
సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వండి
Published Wed, Aug 5 2015 1:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement