తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
అధికార పార్టీ నేత అనుచరుల పనే ?
కలెక్టరేట్ ఎదుట కార్మికుల నిరసన
సాక్షి, హైదరాబాద్ : మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్లేపల్లి శివారులోని యునెటైడ్ బ్రూవరీస్ (గోల్కొండ) యూనిట్ జనరల్ మేనేజర్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. జీఎం సతీష్ భట్ సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఫ్యాక్టరీకి వెళ్తుండగా కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో ఆయన వెళ్తున్న కారును గుర్తుతెలియని వ్యక్తులు అటకాయించారు. అందులో ఉన్న జీఎంను బయటకు లాగి కొట్టారు. ఈలోగా స్థానికులు గుమికూడటంతో గుర్తు తెలియని వ్యక్తులు తాము వచ్చిన కారు (ఏపీ 29ఎ 8923)ను వదిలి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సతీష్ను హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి నిందితుల కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్పత్రిలో జీఎం నుంచి వివరాలు సేకరించారు. జీఎం డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా యూబీ గ్రూపు కంపెనీల సిబ్బంది కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.
మాట వినడం లేదనే?
సీఎం కిరణ్కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న అధికార పార్టీ నేత ఈ ఘటనకు కారకుడని ఆరోపణలు వస్తున్నాయి. సదరు నేత ముఖ్య అనుచరుడు దాడి ఘటనను ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు సమాచారం. అధికార పార్టీ ముఖ్య నేత ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన బీరు కంపెనీల ప్రతినిధుల సమావేశానికి యూబీ జీఎం వెళ్లకపోవడమే దాడికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్టరీ వ్యవహారాల్లో తన మాట చెల్లుబాటు కావడంలేదనే ఆక్కసుతోనే దాడికి పురమాయించినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడికి క్లీన్చిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్తో సహా పట్టుబడిన కారు ఎవరిదనే కోణంలో సమాచారం సేకరిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలతో స్థానికులకు ఉపాధి దక్కకుండా పోతుందని యూబీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు మల్లేశం ఆందోళన వ్యక్తం చేశారు.
యునెటైడ్ బ్రూవరీస్ జీఎంపై దాడి
Published Tue, Oct 29 2013 6:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement