గురుగావ్: అత్తమామలను వేధింపులకు గురిచేసేందుకు, భర్త నుంచి సులభంగా విడాకులు తీసుకొని భరణం పొందేందుకు కొంత మంది మహిళలు భారతీయ శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్ను దుర్వినియోగం చేస్తున్న విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్లోని గురుగావ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, చట్టంలోని ఓ సెక్షన్ ఎక్కువే చదివినట్టున్నది... భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మరుసటి రోజున భర్తతోపాటు, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసును దాఖలు చేసింది.
బ్యాంకర్గా పనిచేస్తున్న 30 ఏళ్ల రాకేశ్ పిలానియా అక్టోబర్ ఐదవ తేదీన తాను నివసిస్తున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మరుసటి రోజే భార్య , భర్త,అత్తమామలపై డౌరీ కేసును దాఖలు చేసిందని 498ఏ సెక్షన్ దుర్వినియోగంపై డాక్యుమెంటరీ తీస్తున్న ఫిల్మ్మేకర్, జర్నలిస్ట్ దీపక్ భరద్వాజ్ తెలిపారు.
ఈ కేసులో రాకేశ్ చనిపోయినందున ఆయన్ని కేసు నుంచి తప్పిస్తారని, అయితే బంధువులపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. భర్త ఆత్మహత్యకు కారకురాలిగా భావించి ఆమెను అరెస్టు చేయకుండా, కేసు పెట్టకుండా ఉండేందుకే ఆమె ఈ వరకట్నం కేసును దాఖలు చేసి ఉండవచ్చని భరద్వాజ్ అనుమానం వ్యక్తం చేశారు. 498ఏ సెక్షన్ దుర్వినియోగానికి ఇది మరో చక్కటి ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు.
‘పది లక్షల రూపాయలు కావాలని వేధిస్తున్నట్టు కేసు పెడతానంటూ మమ్మల్ని, మా అబ్బాయిని కోడలు తరచుగా బెదిరించేది. ఆ బెదిరింపులు, వేధింపులను భరించలేకనే నా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు’ అని రాకేశ్ తండ్రి ఆనంద్ ప్రకాష్ పిలానియా మీడియాకు తెలిపారు. ఇదే విషయమై రాకేశ్ భార్యను కూడా మీడియా సంప్రదించగా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.
చనిపోయిన భర్తపై కట్నం వేధింపుల కేసు
Published Fri, Oct 16 2015 2:19 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement