♦ సాహిత్య అవార్డును వెనక్కిచ్చేస్తా: మలయాళ రచయిత్రి సారా
♦ ఉర్దూ సాహిత్య అవార్డును వాపసు చేస్తా: రెహ్మాన్ అబ్బాస్
♦ సాహిత్య అకాడమీ కమిటీల నుంచి తప్పుకున్న కె. సచ్చిదానందన్
తిరువనంతపురం/న్యూఢిల్లీ: దాద్రీ ఘటన, హేతువాదుల హత్యలపై మరికొందరు రచయితలు నిరసన గళం వినిపించారు. వీటికి, దేశంలో పెరుగుతున్న అసహన సంస్కృతికి నిరసనగా తనకు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రముఖ మలయాళ రచయిత్రి సారా జోసఫ్ శనివారం ప్రకటించారు. మహారాష్ట్ర ఉర్దూ సాహిత్య అకాడమీ పురస్కరాన్ని తానూ వాపసు చేస్తానని ఉర్దూ నవలా రచయిత రెహ్మాన్ అబ్బాస్ ప్రకటించారు. మరోపక్క.. కన్నడ హేతువాది కల్బుర్గికి హత్యకు నిరసనగా ప్రముఖ మలయాళ కవి కె. సచ్చిదానందన్ సాహిత్య అకాడమీ కమిటీల్లోని తన పదవులన్నింటికి రాజీనామా చేశారు. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మలయాళ కథా రచయిత పీకే పరక్కడవు కూడా ప్రకటించారు.
మతసామరస్యానికి పెను ముప్పు: సారా
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయని సారా జోసఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మతసామరస్యానికి, లౌకిక వాదానికి ఇదివరకెన్నడూ లేనంత ముప్పు ఏర్పడిందని త్రిస్సూర్ నుంచి పీటీఐతో చెప్పారు. అవార్డు కింద తనకిచ్చిన నగదు, జ్ఞాపికను కొరియర్లో అకాడమీకి పంపుతానన్నారు. ‘ఇప్పటికే ముగ్గురు రచయితలు హత్యకు గురయ్యారు. మరో రచయిత కేఎస్ భగవాన్కు మతతత్వ శక్తుల నుంచి ప్రాణహాని ఉంది. అయినప్పటికీ రచయితల, కార్యకర్తల, ఇతర వర్గాల భయాలను తొలగించేందుకు కేంద్రం ఏమీ చేయడం లేదు’ అని ఆమె మండిపడ్డారు.
దాద్రీ ఘటన తర్వాత ఉర్దూ రచయితలు ఆందోళనపడుతున్నారని, అందుకే అవార్డు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు అబ్బాస్ ముంబైలో చెప్పారు. ‘ఈ రోజే అవార్డు వాపసు చేస్తానన్నా. అయితే అకాడమీ కార్యాలయ సమయం అయిపోయిందన్నారు. సోమవారం వాపసు చేస్తా’ అని తెలిపారు. రచయితలకు, భావప్రకటన స్వేచ్ఛకు అండగా నిలబడ్డంలో కేంద్ర సాహిత్య అకాడమీ విఫలమైందని సచ్చిదానందన్ ఆరోపించారు. అకాడమీ బెంగళూరులో కల్బుర్గి సంస్మరణ సభ జరిపిందని, అయితే జాతీయ స్థాయిలో ఏదో ఒకటి చేయాల్సి ఉండిందని పేర్కొన్నారు. ఒక తీర్మానం తేవాలని అకాడమీకి తాను విజ్ఞప్తి చేసినా స్పందన కరవైందన్నారు. అకాడమీ జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ బోర్డు, ఫైనాన్షియల్ కమిటీల్లోని తన పదవులకు ఆయన రాజీనామా చేశారు.
మేమూ అవార్డులు వెనక్కి ఇచ్చేస్తాం
Published Sun, Oct 11 2015 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
ఐపీఎల్లో నేటి (మే 1) మ్యాచ్.. చెన్నైని ఢీకొట్టనున్న పంజాబ్
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్తో భార్య సర్ప్రైజ్
- కార్మిక సోదరులకు సీఎం జగన్ మే డే శుభాకాంక్షలు
- ఈసారి ఓటు మార్పు కోసమే
- మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే
- కృష్ణమ్మ తీరం విజయహారం
- వేసవిలో శునకాలు ఎందుకు రెచ్చిపోతుంటాయి?
- గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు
- ఊసరవెల్లి సిగ్గుపడుతోంది!
- శభాష్ సుమతి.. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన పోలీస్
Advertisement