హైదరాబాద్లో హై అలర్ట్ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో హై అలర్ట్

Published Mon, Jul 27 2015 3:23 PM

హైదరాబాద్లో హై అలర్ట్ - Sakshi

హైదరాబాద్: పంజాబ్లోని గురుదాస్ పూర్లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, కీలక ప్రాంతాల్లో భదత్రను కట్టుదిట్టం చేశారు. జంట నగరాల్లో నిఘాను పెంచారు.

సోమవారం ఉదయం గురుదాస్ పూర్లో ఉగ్రవాదులు దాడి చేయడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం శాఖ హెచ్చరించింది. ఉగ్రవాద దాడిలో ఎస్పీ బల్జీత్ సింగ్ సహా 13 మంది మరణించినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.

Advertisement
Advertisement