భోజనంలో బల్లి.. విద్యార్థుల ఆందోళన | Sakshi
Sakshi News home page

భోజనంలో బల్లి.. విద్యార్థుల ఆందోళన

Published Sat, Sep 5 2015 1:22 PM

Hostel students agitation to negligence of hostel staff

విశాఖ: హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు పెట్టే భోజనంలో బల్లి దర్శనమిచ్చిన ఘటన విశాఖ జిల్లాలోని ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున హాస్టల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. అయితే ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై హాస్టల్ యాజమాన్యానికి తాము ఫిర్యాదు చేసినా హాస్టల్ వార్డెన్, సిబ్బంది ఇప్పటివరకూ స్పందించలేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఉదయం అల్ఫాహారం, భోజనంపై పర్యవేక్షణ చేయకుండా హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement