తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Published Sun, Nov 3 2013 8:18 PM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ - Sakshi

తిరుమ‌ల‌: దీపావ‌ళి పండుగ  పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమ‌ల‌కు వచ్చేభ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోంది. అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది.  శ్రీ‌వారి ద‌ర్శనార్ధం ఆదివారం ఇక్కడకు వ‌చ్చిన భ‌క్తులు అన్ని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. 

 

శ్రీ వేంకటేశ్వర స్వామి స‌ర్వద‌ర్శనానికి 18గంట‌ల స‌మ‌యం ప‌డుతుండ‌గా, కాలిన‌డ‌క‌న వ‌చ్చే భ‌క్తుల‌కు 3 గంట‌ల స‌మ‌యం పడుతోంది. తిరుమ‌ల‌కు వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీ కార‌ణంగా మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కే.. శ్రీ‌వారి ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనాన్ని నిలిపివేసినట్టు టీటీడీ ఓ ప్రక‌ట‌న‌లో పేర్కొంది.

Advertisement
Advertisement