- దేశంలో ఎక్కువగా ఇక్కడి యూఎస్ కాన్సులేట్ నుంచే ఎఫ్–1 వీసాలు
- ఈ వీసాల జారీలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు ఐదో స్థానం
- గతేడాదితో పోలిస్తే 40 శాతం అధికంగా వెళ్లిన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యను అభ్యసించాలనుకునే తెలుగు విద్యార్థుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. దీంతో హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ విద్యార్థి (ఎఫ్–1) వీసాల జారీలో రికార్డు సృష్టిస్తోంది. ఈ ఏడాది దేశంలోనే అత్యధికంగా ఏకంగా 50 వేలకుపైగా ఎఫ్–1 వీసాలు జారీ చేసింది. అంతేకాదు ఈ వీసాల జారీలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్లలో హైదరాబాద్ కాన్సులేట్ ఐదో స్థానంలో నిలవడం గమనార్హం.
భారీగా పెరిగిన విద్యార్థులు
మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అమెరికాలో చదువుకోవడానికి వెళ్లేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివేందుకు హైదరాబాద్ కాన్సులేట్ నుంచి వీసాలు పొందిన వారి సంఖ్య 50 వేలు దాటింది. గత ఏడాది (2015)తో పోలిస్తే ఇది 40 శాతం అధికం కావడం గమనార్హం. దేశం మొత్తమ్మీద చూసినా అమెరికాలో చదువు కోవడానికి వీసాలు పొందిన వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే 25 శాతం పెరిగింది. మొత్తంగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు వీసాలు ఇచ్చే కాన్సులేట్లలో హైదరాబాద్ కాన్సులేట్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో నిలిచింది. ఈ వీసాల సంఖ్యలో దేశాల వారీగా చూస్తే భారత్ రెండో స్థానంలో ఉన్నా... అమెరికా కాన్సులేట్ల వారీగా చూస్తే, హైదరాబాద్ దేశంలో మొదటి స్థానంలో, అంతర్జాతీయంగా ఐదో స్థానంలో నిలిచింది. దేశంలో హైదరాబాద్ తర్వాత ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, పుణే, కోల్కతాలు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువ
అమెరికాలో చదువుకోవడానికి మన దేశం నుంచి ఐదేళ్ల కింద వెళ్లిన మొత్తం విద్యార్థుల కంటే... ఈసారి ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన విద్యార్థులే 15 శాతం ఎక్కువగా ఉండడం గమనార్హం. 2011లో భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన విద్యార్థులు (ఎఫ్–1 వీసాపై) 40 వేల మంది. అదే ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 50 వేల మంది ఎఫ్–1 వీసాలు పొందారు. గత సంవత్సరం తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వీసాలు పొందినవారు సుమారు 36 వేల మంది. అమెరికాలో విద్య అభ్యసించడానికి వచ్చేవారు చదువు పూర్తి కాగానే తిరిగి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలు తెలుగు విద్యార్థులపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పరాజయం పాలవుతారని దాదాపు అన్ని సర్వేలు పేర్కొనడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడేటప్పటికే రికార్డు స్థాయిలో హైదరాబాద్ కాన్సులేట్ నుంచి దాదాపు 48 వేల మంది ఎఫ్–1 వీసాలు పొందారు. డిసెంబర్ మొదటి వారం నాటికి మరో 2,500 మంది ఈ వీసాలు పొందారు.
విద్యార్థి వీసా.. హైదరాబాదీయే బాద్షా!
Published Sun, Dec 18 2016 5:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement