న్యూఢిల్లీ: కష్టాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైనా ట్వీట్ చేసిన వెంటనే విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తారు. వారి కష్టాలను తెలుసుకుని సాయం చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తారు. కాగా భారత్లో కష్టాల్లో ఉన్న ఓ ఇరానీ మహిళకు సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం విన్నవించగా.. తాను ఆమె విషయంలో సాయం చేయలేననని సుష్మా చెప్పారు. ఇరానీ మహిళ కేసు కోర్టు పరిధిలో ఉందని, అందువల్ల తాను జోక్యం చేసుకోలేనని స్పష్టం చేశారు.
ఇరాన్లో జన్మించి బ్రిటీష్ పౌరసత్వం కలిగిన నర్గెస్ అష్టారికి ఓ కేసులో ఒడిశా కోర్టు 3 లక్షల రూపాయల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించింది. ఆమె పైకోర్టులో అప్పీలు చేయగా, కేసు పెండింగ్లో ఉంది. బెయిల్పై ఆమె విడుదలైంది. అష్టారికి సాయం చేయాల్సిందిగా ఒడిశా ప్రభుత్వం సుష్మా దృష్టికి తీసుకెళ్లగా.. ఆమె కేసు న్యాయస్థానంలో ఉన్నందును తాను సాయం చేయడం సాధ్యంకాదని బదులిచ్చారు. అష్టారి కేసుకు సంబంధించిన వివరాలను ఒడిశా ప్రభుత్వం నుంచి సుష్మా తెలుసుకున్నారు. 2011లో ఒడిశాలో ఓ ఎన్జీవో (ఏఎస్ఎస్ఐఎస్టీ) తరఫున పనిచేసేందుకు ఆమెకు వీసా మంజూరైంది. ఆ తర్వాత అష్టారి సొంతంగా ఎన్జీవో ప్రిషన్ ఫౌండేషన్ను స్థాపించింది. ఒడిశాలోని రాయగఢ్ జిల్లాలో సొంత డబ్బులతో బాలికల కోసం ఓ అనాథాశ్రమాన్ని ఏర్పాటు చేసింది. 2014లో ఓ అంధ బాలుడు ప్రమాదవశాత్తూ ఓ నదిలో పడి గల్లంతయ్యాడు. అతని తల్లిదండ్రులు అదే పాఠశాలలో పనిచేస్తారు. కాగా ఏఎస్ఎస్ఐఎస్టీ ఒత్తిడి మేరకు వాళ్లు అష్టారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకును ఆమె నదిలో తోసి చంపిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సారీ.. నేను సాయం చేయలేను: సుష్మా
Published Sat, Dec 31 2016 3:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
తప్పక చదవండి
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
Advertisement