గుజరాత్లో 2002లో జరిగిన గోధ్రా అనంతర అల్లర్ల సమయంలో అక్కడ తానుంటే, మోడీ కంటే బాగా వాటిని అణిచేసేవాడినని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ వ్యాఖ్యానించారు. న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఇండియా బ్లాగ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ''అప్పట్లో అల్లర్లను యంత్రంగం బాగా అణిచేసి ఉండాలి. కానీ, మోడీ అప్పటికి ముఖ్యమంత్రి పదవి కొత్తగా చేపట్టారు. నేను ఉండి ఉంటే మరింత బాగా అణిచేసేవాడిని. మోడీ మీద ఆ మరక పడింది గానీ, వ్యక్తిగతంగా ఆయన అల్లర్లకు బాధ్యుడు కాడు. దోషి అయి ఉంటే ఈపాటికే ఆయనకు శిక్ష పడేది. ఆయనంటే భయపడేవాళ్లే మోడీని వ్యతిరేకిస్తారు'' అన్నారు. అల్లర్లకు కారణం యంత్రాంగం వైఫల్యమేనని పారిక్కర్ అన్నారు. ప్రధాని పదవికి తాను తగిన అభ్యర్థిని కానే కానని, మోడీ యువతకు ఆశాజ్యోతిగా ఎదిగారని అన్నారు. యువత మొత్తం మోడీని ప్రధానిగా చూడాలనుకుంటోందని, ఆయన ప్రధాని కావాలంటే వాళ్లు తమ ప్రతినిధులుగా సరైనవారిని ఎన్నుకోవాలని చెప్పారు.
ఇక గోవాలో కేథలిక్కులు సాంస్కృతిక పరంగా హిందువుల లాంటివాళ్లేనంటూ పారిక్కర్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. భారతదేశ సాంస్కృతిక మూలాల్లో హిందూత్వం ఉందని, గోవాలో కేథలిక్కులకు, బ్రెజిల్లోని వారికి అసలు పోలికే లేదని.. చాలావరకు ఇక్కడి కేథలిక్కులు హిందువుల ఆచారాలనే పాటిస్తారని ఆయన అన్నారు. గోవా జనాభాలో దాదాపు 30 శాతం మంది కేథలిక్కులే. గతంలో గోవా అసెంబ్లీలో 24 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ, ఏకంగా 8 మంది కేథలిక్కులను అభ్యర్థులుగా నిలబెట్టింది. కొందరు టీవీ చానళ్ల వాళ్లు అనుకుంటున్నట్లుగా తాను కత్తిపట్టుకుని ముస్లింలను నరకడానికి వెళ్లేలాంటి హిందూత్వ వాదిని కానని పారిక్కర్ స్పష్టం చేశారు.
గోధ్రా సమయంలో నేనుంటే మోడీ కంటే బాగా అణిచేసేవాడిని: పారిక్కర్
Published Thu, Sep 5 2013 11:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement