ఢిల్లీపై డ్రోన్ దాడులు ? | Sakshi
Sakshi News home page

ఢిల్లీపై డ్రోన్ దాడులు ?

Published Tue, Apr 28 2015 9:27 AM

ఢిల్లీపై డ్రోన్ దాడులు ? - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు కొరకరాని కొయ్యగా మారిన ఉగ్రవాద సంస్థలు లష్కరే ఈ తోయిబా, జైషే భారత్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తోందని సమాచారం ఉన్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీపై అది డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించాలని చూస్తోందని, అప్రమత్తంగా ఉండాలని మంగళవారం హెచ్చరించింది.

గుర్తు తెలియని వ్యక్తులపై మరింత నిఘాను పెంచాలని, వారిని అదుపులోకి తీసుకొని విచారించాలని కూడా సూచించింది. కొందరు అనుమానితులు డ్రోన్ దాడులు జరిపేందుకు సహకరించే ప్రమాదం ఉందని చెప్పింది. దీంతోపాటు, భారత గగన తలంలోకి పైలెట్ రహిత విమానాలను ఏమాత్రం అనుమతించకూడదని హెచ్చరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement