* శంషాబాద్ విమానాశ్రయానికి తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
* ఢిల్లీ, బేగంపేట ఎయిర్పోర్ట్లు పన్ను కడుతున్నట్లు స్పష్టీకరణ
* ఆస్తి పన్ను పరిధిలోకి రావన్న జీఎంఆర్ అభ్యర్థనల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: రన్వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందేనని శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ యాజమాన్యం ‘జీఎంఆర్’కు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అవసరాలకు వినియోగించే ‘రన్ వే’తో పాటు ఎయిర్పోర్ట్లో వాహనాల పార్కింగ్కు వినియోగించే ‘ట్యాక్సీ వే’లు సైతం ఆస్తి పన్ను పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇందుకోసం దేశంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు స్థానిక విమానాశ్రయాలపై విధిస్తున్న రన్వే, ట్యాక్సీ వేకు సంబంధించిన ఆస్తి పన్నుల సమాచారాన్ని ప్రభుత్వం తెప్పించుకుంది. ఆ వివరాలను శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యానికి తెలియజేస్తూ.. పన్నులు చెల్లించాల్సిందేనని కోరింది.
వాస్తవానికి మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆస్తుల జాబితాలో విమానాశ్రయాల రన్వేలు, ట్యాక్సీవేలు లేవు. అయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వసూలు చేస్తుండడంపై గతంలో కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రెండేళ్ల నుంచి విమానాశ్రయ యాజమాన్యం వీటిపై ఆస్తి పన్ను చెల్లించడం ఆపేసింది. పన్ను విధింపుపై పునఃపరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అధ్యయనానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రన్వేలు, ట్యాక్సీవేలపై దేశవ్యాప్తంగా ఆస్తి పన్ను విధిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఈ కమిటీ కీలక ఆధారాలను సేకరించింది.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నగరంలోని బేగంపేట విమానాశ్రయాలకు లేఖలు రాసి రన్వేలు, ట్యాక్సీవేలపై ఆస్తి పన్ను విధిస్తున్నట్లు సమాచారాన్ని రాబట్టింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యం సైతం ఆస్తి పన్ను కట్టాల్సిందేనని కమిటీ తేల్చిచెపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
త్వరలో ప్రత్యేక రేటు ఖరారు
శంషాబాద్ విమానాశ్రయ పరిధిని ప్రభుత్వం ‘నోటిఫైడ్ ఏరియా కమిటీ’గా ప్రకటించడంతో పాటు ఓ మున్సిపల్ కమిషనర్ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ కమిటీ విమానాశ్రయ యాజమాన్యం నుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తుంది. రన్వే, ట్యాక్సీవే మినహా ఇతర ఆస్తులపై జీఎంఆర్ పన్నులు చెల్లిస్తోంది. తాజాగా రన్వే, ట్యాక్సీవేపై సైతం పన్నులు వసూలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ప్రత్యేక రేటును త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనుంది.
రన్వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందే..
Published Wed, Aug 5 2015 3:30 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
షర్మిల ఆడియో లీక్
మాకు ఓటు వేయకుంటే కరెంట్ కట్: కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపు!
తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం.. 48 గంటలపాటు ప్రచారం ఆపేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం .. ఇంకా ఇతర అప్డేట్స్
సింగర్ హత్య కేసు నిందితుడిపై కాల్పులు.. స్పాట్లోనే!
అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్
హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్
కైకేయి.. శూర్పణఖ... ఏదైనా ఓకే
జయహో జోయా
మన సర్పంచులు @ ఐరాస
కృష్ణమ్మతో సత్యదేవ్ స్టార్ అవుతాడు: రాజమౌళి
తప్పక చదవండి
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
Advertisement