మహబూబ్నగర్ జిల్లా ఆస్పత్రుల్లో చేరిన 490 మంది బాధితులు
సాక్షి నెట్వర్క్, మహబూబ్నగర్ : కల్తీకల్లుకు బానిసలుగా మారి వింతగా ప్రవర్తిస్తున్న రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మహబూబ్నగర్ జిల్లాలో శుక్ర, శనివారాల్లో 490 మంది ఈ లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. ఇప్పటికే ఇద్దరు బాధితులు మరణించగా, అనేక గ్రామాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు ఎక్సైజ్ అధికారులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. నారాయణపేట మండలంలో 11 మంది, గద్వాల మండలంలో శనివారం 18 మంది బాధితులు వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల్లో చేరారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 20 మంది ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
2 రోజుల్లో నియోజకవర్గంలో 48 మంది వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో చేరారు. కొడంగల్లో 20 మంది, చిట్లపల్లిలో 5, బొంరాస్పేట మండలం ఎనికెపల్లిలో 10, రేగడిమైలారంలో 15, బొంరాస్పేటలో 8, మద్దూరు మండలం దోరేపల్లిలో 28, దామరగిద్ద మండలం క్యాతన్పల్లిలో 8, దామరగిద్దలో 25, దౌల్తాబాద్ మండలం తిమ్మారెడ్డిపల్లిలో 5, గోకాపస్లావాద్లో 10, కోస్గిలో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. బాలానగర్ మండలంలో రెండు రోజుల్లో 170 మంది వింతగా ప్రవర్తిస్తున్నారు. జడ్చర్ల మండలంలో 19 మంది ఆస్పత్రిలో చేరారు. అలంపూర్ నియోజకవర్గంలో 23 మంది కల్తీకల్లు బాధితులున్నట్టు తేలింది. అలంపూర్లో 11 మంది, ఇటిక్యాలలో 12 మంది చికిత్స పొందుతున్నారు.
ఇప్పటికే ఇద్దరు మృతి
నారాయణపేట మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన బాలమ్మ (70), మక్తల్ మండలం ఊట్కూర్కు చెందిన కూలి జంగిడి క్రిష్ణయ్య(55) నారాయణ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా కరీంనగర్లో 18 మంది వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రిలో చేరారు.
పెరుగుతున్న కల్లు బాధితులు
Published Sun, Sep 20 2015 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement