సాక్షి, స్కూల్ ఎడిషన్: ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాలను పణంగా పెట్టి చేసిన పోరాట ఫలితంగా భారతీయులు నేడు స్వీచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నారు. భారత ఉపఖండంలో స్వాతంత్య్రం కోసం జరిగిన ఈ ఉద్యమాలన్నింటినీ కలిపి ‘భారత స్వాతంత్య్రోద్యమం’గా పిలుస్తారు. అనేక సాయుధ పోరాటాలు, అహింసా పద్ధతిలో జరిగిన ఉద్యమాలు భారత స్వాతంత్య్ర పోరాటంలో భాగాలు. భారత ఉపఖండంలోని బ్రిటిష్ పాలనను అంతమొందించడానికి ఎవరికి నచ్చిన సిద్ధాంతాలతో వారు ఉద్యమించారు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆనాటి పోరాటాలను ఒకసారి గుర్తుచేసుకుందాం..!
తొలి అడుగు
16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకు వ్యతిరేకంగా అబ్బక్కరాణి చేసిన పోరాటాలు, 17వ శతాబ్దం మధ్యలో బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటాలను వలస పాలనపై పోరాటానికి పడిన తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. మొదటి సాయుధ పోరాటం బెంగాల్లో ప్రారంభమై, తర్వాత రాజకీయ పోరాటంగా పరిణామం చెంది భారత జాతీయ కాంగ్రెస్గా ఆవిర్భవించింది.
కీలకమార్పు.. సిపాయిల తిరుగుబాటు
కాంగ్రెస్లో అతివాదులైన లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ (లాల్ బాల్ పాల్).. విదేశీ వస్తు బహిష్కరణ, సమ్మె, స్వావలంబన వంటి పద్ధతులను అవలంభిస్తే, అరబిందో వంటివారు తీవ్రవాద మార్గాలను ఆశ్రయించారు. మొదటి దశ కాలంలో సాయుధ విప్లవ పోరాటాలు ముందుకొచ్చాయి. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారత స్వాతంత్య్ర యోధులు ప్రారంభించిన గదర్ పార్టీ సహకారంతో జరిగిన భారత సిపాయిల తిరుగుబాటు జాతీయోద్యమంలో వచ్చిన కీలకమైన మార్పు.
తనదైన మార్గాన్ని ఎంచుకున్న గాంధీ
జాతీయోద్యమం చివరి దశలో జాతీయ కాంగ్రెస్ మహాత్మాగాంధీ నాయకత్వంలో అహింసాయుత మార్గంలో ఉద్యమించింది. ప్రముఖ విద్యావేత్త రాంజీసింగ్.. మహాత్మాగాంధీని 20వ శతాబ్దంలో అవతరించిన బోధిసత్వునిగా కీర్తించారు. అయితే ఇతర నాయకులు మాత్రం సాయుధ పోరాటాలను కొనసాగించారు. సుభాష్ చంద్రబోస్ సాయుధ సంగ్రామమే సరైనదిగా భావిస్తే, మిగిలిన వారు సన్నకారు రైతులు, శ్రామికుల ఆర్థిక స్వాతంత్య్రానికై పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం నాటికి ఈ ఉద్యమాలు ఉధృత రూపం దాల్చాయి. నేతాజీ ఆజాద్ హింద్ ఫౌండేషన్ పేరుతో భారత జాతీయ సైన్యాన్ని స్థాపించి తూర్పు ఆసియా నుంచి పోరాడగా, భారత జాతీయ కాంగ్రెస్ ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి పిలుపునిచ్చింది.
అంతిమ విజయం
మహాత్మా గాంధీ నాయకత్వంలో 1947 ఆగస్టు 15న భారతదేశం స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించింది. 1950 నవంబర్ 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశాన్ని ‘సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య గణతంత్య్ర రాజ్యం’గా ఆవిర్భవింపచేసింది.
ఎందరో పోరాటయోధుల త్యాగఫలం..
Published Sat, Aug 15 2015 11:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement