మన దేశం ఒక విశిష్టమైన గుర్తింపు సాధించింది. మొట్టమొదటి రాకెట్ ప్రయోగం చేసి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1963 నవంబర్ 21వ తేదీన అమెరికాలో తయారైన రాకెట్ను తొలిసారిగా కేరళలోని తిరువనంతపురం సమీపంలోగల తుంబ అనే చిన్న తీరప్రాంత గ్రామం నుంచి అంతరిక్షంలోకి పంపారు. ఇప్పుడు ఏకంగా అంగారకుడిని జయించే దిశగా భారత అంతరిక్ష కార్యక్రమం దూసుకెళ్తోంది. ఎక్కువగా తాడిచెట్లతో ఉండే ఈ గ్రామం ఆధునిక భారతదేశ సంస్కృతికి కొంత దూరంగానే ఉంటుంది. కానీ, మొదటి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన చరిత్రను మాత్రం సుస్థిరం చేసుకుంది.
తర్వాతికాలంలో ఈ ప్రయోగ కేంద్రాన్ని తుంబా ఈక్వెటోరియల్ రాకెట్ లాంచ్ స్టేషన్ (టీఈఆర్ఎల్ఎస్) అని, ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ స్టేషన్ (వీఎస్ఎస్సీ) అని పిలవసాగారు. ఇదే అప్పటినుంచి ఇస్రోకు చాలా ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా నిలిచింది. విక్రమ్ సారాభాయ్ కొంతమంది యువ శాస్త్రవేత్తలను చేరదీసి, వారిని అమెరికా పంపి, అక్కడ సౌండింగ్ రాకెట్ల ప్రయోగంలో శిక్షణ ఇప్పించారు. అలా తొలుత శిక్షణ పొందినవారిలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తదితరులు కూడా ఉన్నారు.
దక్షిణ కేరళలోని తుంబ ప్రాంతం గుండా భూమధ్యరేఖ వెళ్తుండటం వల్ల ఈ ప్రాంతం రాకెట్ ప్రయోగాలకు అత్యంత అనువైనదిగా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అంతరిక్ష కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాతే శ్రీహరికోటను కూడా అనువైన ప్రాంతంగా గుర్తించి, దాన్ని అభివృద్ధి చేశారు.
అంతరిక్షంపై మన విజయానికి స్వర్ణోత్సవం
Published Thu, Nov 21 2013 2:18 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement