న్యూఢిల్లీ: టెక్నాలజీ అభివృద్ది చెందిన తర్వాత ప్రపంచం ఓ కుగ్రామంలా మారిపోయింది. సెల్ఫోన్తోనే ఎన్నో వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్.. ఏదైనా సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని, వాటికి బానిసలుగా మారినా, దుర్వినియోగం చేసినా దుష్పరిణామాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీ మరణాలే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నారు.
తాజ్మహల్ లేదా ఏ చారిత్రక కట్టడం ముందో దర్జాగా సెల్ఫీ తీసుకోవచ్చు. అయితే రన్నింగ్ ట్రైన్ ముందు, గన్తో పోజులిస్తూ, కొండ అంచున నుంచుని సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ప్రమాదం తప్పకపోవచ్చు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు దక్కవు. ఇలా ప్రయత్నించి మరణించిన వారు చాలా మంది ఉన్నారు. విషాదం ఏంటంటే సెల్ఫీ మరణాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. పొరుగుదేశం పాకిస్థాన్ తర్వాతి స్థానంలో ఉంది.
అమెరికాకు చెందిన కార్నెగీ మెలాన్ యూనివర్శిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ఫీ మరణాలపై అధ్యయనం చేశాయి. 2014 మార్చి నుంచి ఇప్పటివరకు 127 మంది సెల్ఫీ మరణాలు సంభవించాయని గుర్తించారు. భారత్లో సెల్ఫీ తీసుకుంటూ 76 మంది మరణించారు. పాకిస్థాన్లో తొమ్మిదిమంది, అమెరికాలో ఎనిమిదిమంది, రష్యాలో ఆరుగురు ఇలాగే చనిపోయారు. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ జనాభా ఎక్కువని, అందుకే సెల్ఫీ మరణాలు ఎక్కువ సంభవించాయని అధ్యయనం చేసిన వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల చైనాలో సెల్ఫీ తీసుకుంటూ చనిపోయినవారు కేవలం నలుగురేనని వెల్లడించింది.
గతవారం ఉత్తర భారతదేశంలో రన్నింగ్ ట్రైన్ ముందు నిల్చుని సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. అలాగే పడవలో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించి మరణించినవారు ఉన్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్పీలు తీసుకోవడానికి యువత మోజు పడుతుండటమే ప్రమాదాలకు కారణమని అధ్యయనంలో తేలింది.
భారత్ టాప్.. పాకిస్థాన్ సెకండ్
Published Sat, Nov 19 2016 4:31 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement