న్యూఢిల్లీ: నానాటికీ జారిపోతున్న రూపాయిని ఆదుకునేందుకు, కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కళ్లెం వేయడానికి ప్రభుత్వం మరిన్ని అస్త్రాలను ప్రయోగించనుంది. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం శుక్రవారం ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వరంగ కంపెనీ(పీఎస్యూ)లకు విదేశీ రుణ సమీకరణ(ఈసీబీ) నిబంధనల్లో మరింత సడలింపు, ఎగుమతులను పెంచేవిధంగా ప్రోత్సాహకాలు, నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులకు అడ్డుకట్టవేయడం వంటి చర్యలు ఉండొచ్చని ఆయా వర్గాలు వెల్లడించాయి. కాగా, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావుతో కూడా చిదంబరం సంప్రదింపులు జరిపారు. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీతో పోలిస్తే 4.8 శాతం) ఎగబాకడం తెలిసిందే.
క్యాడ్కు అడ్డుకట్టవేయడానికి వీలుగా నిత్యావసరంకాని వస్తువుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి(బడ్జెట్ విభాగం) రజత్ భార్గవ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే సూచించింది. బొగ్గు, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ వంటివాటిపై దృష్టిపెట్టనున్నారు. రూపాయి చికిత్సకోసం ఆర్బీఐ ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) తగ్గింపు, ఫారెక్స్ మార్కెట్లో స్పెక్యులేషన్కు అడ్డుకట్ట వంటి పలు చర్యలను ప్రకటించింది. అయినాసరే డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త కనిష్టాలను తాకుతూనే ఉంది. ఈ నెల 6న ఇంట్రాడేలో 61.80కు పడిపోయి చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది. దీంతో ప్రతి సోమవారం రూ.22వేల కోట్లవిలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం గమనార్హం.
రూపాయి చికిత్సకు త్వరలో మరిన్ని అస్త్రాలు!
Published Sat, Aug 10 2013 2:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
తొడలు కొట్టే నేత.. ప్రజాసేవలో తొండాట
ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
తీరం మారింది
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
హస్తిన ‘దండు’యాత్ర
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై తలకిందులైన కారు
తప్పక చదవండి
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
Advertisement