న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత ప్రభుత్వం ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా హయాం ముగిసిపోయేలోగా అగ్రరాజ్యంతో అనుకున్న ఒప్పందాలన్నింటినీ త్వరత్వరగా పట్టాలెక్కించాలని భావిస్తోంది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే తరహాలో సైనిక నిఘాకు ఉద్దేశించిన ప్రిడేటర్ డ్రోన్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. దీంతోపాటు పలు రక్షణ, అణు ప్రాజెక్టుల ఒప్పందాలు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది.
22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్స్ను తమకు అమ్మాలని భారత్ గత జూన్లో అమెరికాను కోరింది. ఈ ఒప్పందం విషయంలో ప్రస్తుతం సంప్రదింపులు పురోగతి సాధించాయని, ఒబామా పదవిలోంచి దిగిపోయేలోగా ఈ కొనుగోలు ఒప్పందం పూర్తయ్యే అవకాశముందని భారత అధికార వర్గాలు తెలుపుతున్నాయి. రానున్న కొద్దినెలల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశముందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మారిన మోదీ వ్యూహం!
భారత ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో వ్యక్తిగత బంధాన్ని ఏర్పరుచుకున్నారు. ఒబామా కూడా అమెరికా విదేశీ దౌత్యవ్యూహంలో ఘననీయమైన మార్పును తీసుకొచ్చి.. మధ్యప్రాచ్యం నుంచి ఆసియా మీదకు దృష్టి కేంద్రీకరించారు. భారత్కు అతిపెద్ద ఆయుధాల సరఫరాదారుగా ఉన్న రష్యాను భారత్ పక్కనపెట్టేలా అమెరికా ఒప్పించగలిగింది. ఇందుకు ప్రతిగా భారత్కు అత్యున్నత సైనిక సాంకేతికత అందించడంతోపాటు బిలియన్ డాలర్లు విలువ చేసే అణురియాక్టర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతేకాకుండా మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజిమ్లో భారత్కు స్వభ్యత్వం వచ్చేలా చూసింది. దీంతో భారత్కు ప్రిడేటర్ డ్రోన్లు అమ్మేందుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం కోసం అమెరికా రక్షణమంత్రి అష్టన్ కార్టర్ ఈ ఏడాది చివర్లో భారత్కు వచ్చే అవకాశముంది.
భయపెడుతున్న ట్రంప్ 'అమెరికా ఫస్ట్'
అమెరికా ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన విదేశీ విధానంలో 'అమెరికా ఫస్ట్' అంశానికే ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు. ఆయన ప్రకటనలు ఇటు భారత్లోనూ, అటు ఆసియాలోనూ సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఆసియాకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఒబామా వ్యూహం నుంచి ట్రంప్ తప్పుకోవచ్చునని వినిపిస్తోంది. ట్రంప్ ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా మిత్రదేశాలు దక్షిణ కొరియా, జపాన్కు ఇస్తున్న రక్షణ సహకారంపై సందేహాలు రేకెత్తించారు. వారికి నేరుగా ఆయుధసాయం చేయడం కంటే.. సొంతంగా అవే అణ్వాయుధాలు రూపొందించుకునేలా చూస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ట్రంప్ అధ్యక్షుడైతే అమెరికా విధానంలో ఆసియాకు ప్రాధాన్యం తగ్గొచ్చునని, ఇది పరోక్షంగా ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ గెలుస్తాడేమోనన్న భయంతో భారత్..!
Published Wed, Oct 5 2016 4:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
Advertisement