ఆఫ్ఘాన్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి | Sakshi
Sakshi News home page

ఆఫ్ఘాన్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి

Published Fri, May 23 2014 9:15 AM

ఆఫ్ఘాన్లో భారత దౌత్య కార్యాలయంపై దాడి - Sakshi

ఆఫ్ఘానిస్థాన్ హెరాత్ నగరంలోని భారతీయ దౌత్య కార్యాలయంపై శుక్రవారం తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారు. దౌత్య కార్యాలయంపై దాడి సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఐటీబీపీ, ఆఫ్ఘాన్ దళాలను రంగంలోకి దింపింది.

దాంతో తీవ్రవాదులకు సైన్యానికి మధ్య హోరాహోరి కాల్పులు కొనసాగుతున్నాయి. కాగా భారతీయ దౌత్య కార్యాలయంలోని సిబ్బంది అంత క్షేమంగానే ఉన్నారని భారత్లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.



 

Advertisement

తప్పక చదవండి

Advertisement