ప్రపంచ మార్కెట్ల సానుకూలతతో భారత్ స్టాక్ సూచీలు బుధవారం ట్రేడింగ్ తొలిదశలో ఆర్జించిన లాభాలను ముగింపు సమయంలో కోల్పోయాయి. ఫలితంగా వరుసగా నాలుగోరోజూ నష్టాలతో ముగిసాయి. తొలుత పాజిటివ్గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 20,828 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగింది. అయితే భారతి ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ల ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాల్ని మిస్కావడంతో సెన్సెక్స్ లాభాలను కోల్పోయి 36 పాయింట్ల నష్టంతో 20,647 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
నాలుగు రోజుల్లో బీఎస్ఈ సూచి 726 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇదేబాటలో 6,170 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 6 పాయింట్ల నష్టంతో 6,120 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ విషయమై బుధవారం అర్థరాత్రి వెల్లడించే నిర్ణయం పట్ల ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించారని, దాంతో తగిన కొనుగోలు మద్దతు లభించలేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి. జనవరి డెరివేటివ్ సిరీస్ మరో రోజులో ముగియనున్నందున అమ్మకాల ఒత్తిడి ఏర్పడినట్లు ఆ వర్గాలు వివరించాయి.
మెటల్, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సేసా స్టెరిలైట్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్లు 2 శాతం మేర నష్టపోయాయి. భారతి ఎయిర్టెల్ 1 శాతం క్షీణించింది. ఫార్మా షేర్లు ర్యాన్బాక్సీ, సన్ఫార్మా, సిప్లాలు 1.5-3.5 శాతం మధ్య పెరిగాయి. మారుతి సుజుకి 6.5 శాతం, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్లు 4 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 250 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 17 కోట్లు వెనక్కుతీసుకున్నాయి.
తొలి లాభాలు ఆవిరి
Published Thu, Jan 30 2014 1:27 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
48 గంటల ముందే మద్యం దుకాణాల బంద్
వైఎస్సార్ సీపీలో చేరికలు
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత
ప్రశాంత ఎన్నికల నిర్వహణకు కృషి
సెపరేటు
రిజర్వేషన్లకు ముప్పు తేవద్దు
ముస్లింల సంక్షేమానికి జగన్ పెద్దపీట
హమారా జగన్
పాలిసెట్లో సత్తా చాటిన ‘శశి’
నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
తప్పక చదవండి
- సంతోషం.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement