ఇందిర, పటేల్కు ప్రముఖుల ఘన నివాళి | Sakshi
Sakshi News home page

ఇందిర, పటేల్కు ప్రముఖుల ఘన నివాళి

Published Thu, Oct 31 2013 12:32 PM

ఇందిర, పటేల్కు ప్రముఖుల ఘన నివాళి

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 29వ వర్థంతి సందర్భంగా ఇందిరకు ప్రముఖులు నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని శక్తిఘాట్ వద్ద గురువారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు ...ఇందిరకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు.

ఇక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ప్రాంగణంలో ఆయనకు ప్రముఖులు అంజలి ఘటించారు. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, స్పీకర్ మీరాకుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇక గాంధీభవన్లోనూ ఇందిరాగాంధీ వర్థంతితో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, పలువురు మంత్రులు హాజరు అయ్యారు.
 

Advertisement
Advertisement