మూడుసార్లు అతిక్రమిస్తే పెళ్లి చేస్తారు! | Sakshi
Sakshi News home page

మూడుసార్లు అతిక్రమిస్తే పెళ్లి చేస్తారు!

Published Fri, Sep 4 2015 12:07 PM

మూడుసార్లు అతిక్రమిస్తే పెళ్లి చేస్తారు! - Sakshi

జకార్తా: కుర్ర ప్రేమజంటలకు మింగుడు పడని వార్త. టీనేజీ లవర్స్ అక్కడ రాత్రిపూత కలుసుకోవడం ఇక కుదరదు. నిబంధనలను అతిక్రమించి కలుసుకుంటే పెళ్లి చేసేస్తారు. ఈ నిబంధన 17 ఏళ్లలోపు వయస్సువారికి మాత్రమే.

టేనేజీ ప్రేమపక్షుల ప్రణయ కలాపాలకు ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు ఇండోనేసియాలోని పూర్వకర్త నగరం పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. దీని ప్రకారం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత టేనేజీ లవర్స్ కలుసుకోకూడదు. వీరిపై గస్తీ దళాలు, సీసీ కెమెరాతో నిఘా పెడతారు. నిబంధన ఉల్లంఘించిన వారికి విలేజ్ కల్చరల్ కౌన్సిల్ తో కౌన్సిలింగ్ ఇస్తారు. వరుసగా మూడుసార్లు నిబంధన అతిక్రమిస్తే ప్రేమికులకు పెళ్లి చేయాలని తల్లిదండ్రుల కౌన్సిల్ సూచిస్తుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement