బ్రేకింగ్ న్యూస్: ఇండోనేషియన్ విమానం మిస్సింగ్ | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్ న్యూస్: ఇండోనేషియన్ విమానం మిస్సింగ్

Published Sat, Dec 3 2016 3:59 PM

బ్రేకింగ్ న్యూస్: ఇండోనేషియన్ విమానం మిస్సింగ్

రెండు ఇంజన్లతో కూడిన ఓ ఇండోనేషియన్ పోలీసు విమానం శనివారం మిస్ అయింది. ఈ విమానంలో మొత్తం 15 మంది ప్యాసెంజర్లు ఉన్నారు. మెన్సానాక్, సెబాంగ్కా లేదా జెంటార్ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఈ విమానం కూలిపోయినట్టు పోలీసుల వర్గాలు భావిస్తున్నాయి. కనిపించకుండా పోయిన ఈ విమానం గురించి సెర్చ్ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిందని, దీనికి సంబంధించిన కొన్ని శకలాలను సెర్చ్ టీమ్ గుర్తించినట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దక్షిణ సింగపూర్కు చెందిన బతమ్ ద్వీపకల్ప మార్గంలో ఈ విమానం ప్రయాణిస్తోంది.
 
దక్షిణ సింగపూర్కు చెందిన బతమ్ ద్వీపకల్ప మార్గంలో ఇది ప్రయాణిస్తోంది. అయితే దీనికి సంబంధించిన మిగతా వివరాలేమీ ఇంకా తెలియరాలేదు. నాలుగు రోజుల క్రితమే ఎవరూ ఊహించని విధంగా విమానంలో ఇంధనం లేక, ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్తో కొలంబియా నగరం పర్వత ప్రాంతాల్లో ఓ విమానం  కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 80 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ మృతుల్లో బ్రెజిల్కు చెందిన ఓ ఫుట్బాల్ టీమ్ కూడా ఉంది.
 

Advertisement
Advertisement