ప్రజాప్రతినిధులకు ఫోన్లపై సర్వత్రా చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు నేరుగా ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్న వైనం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. జీవోఎం నివేదిక తయారీ కసరత్తు కూడా తుది దశకు చేరుకున్న సమయంలో రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులకు నిఘా వర్గాల ఫోన్లు పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టడానికేనన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తం 294 మంది ఎమ్మెల్యేల నుంచీ సమాచారం సేకరించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. నిఘా వర్గాల పేరుతో రెండు రోజులుగా పలువురు ప్రజాప్రతినిధులకు ఫోన్లు వచ్చాయి. తెలంగాణకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే తనకిలాంటి ఫోన్ రాగా, అవతలివైపు నుంచి మాట్లాడుతున్నది ఎవరో అడిగే ప్రయత్నం కూడా చేయకుండానే తన అభిప్రాయం చెప్పారు. జేఏసీ ప్రతినిధులతో పాటు టీఆర్ఎస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలకూ ఫోన్లు వచ్చాయంటున్నా వారిలో పలువురు వాటిని ఖండించారు.
తాజాగా కొందరు టీడీపీ నేతలు తమకూ నిఘా వర్గాల నుంచి ఫోన్లు వచ్చాయని చెప్పారు. వారు చెప్పిన మేరకు... తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్. రమణ, ఉమా మాధవరెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, జి. విజయ రమణారావు తదితరులకు నిఘా అధికారులు ఫోన్ చేశారు. ‘రాయల తెలంగాణ మీకు సమ్మతమేనా? సమ్మతం కాకపోతే ఎందుకు? ప్రత్యేక తెలంగాణ ను ఎందుకు కోరుకుంటున్నారు?’ అంటూ ప్రశ్నించి సమాధానాలను నమోదు చేసుకున్నట్టు సమాచారం. అనంతపురం జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి కూడా నిఘా ఫోన్ వచ్చింది. ఇదంతా తాము నిత్యం చేసే అభిప్రాయ సేకరణలో భాగమే తప్ప రాయల తెలంగాణపై పార్టీల అభిప్రాయాలు సేకరించాల్సిందిగా ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి తమకెలాంటి ఆదేశాలూ రాలేదని నిఘా అధికారులు చెబుతున్నారు. ఐబీ అధికారులు మాత్రం ఏ అభిప్రాయ సేకరణైనా తాము నేరుగా చేస్తాం తప్ప మరో విభాగానికి అప్పజెప్పబోమంటున్నారు.
‘నిఘా’ లోగుట్టేమిటో?, ప్రజాప్రతినిధులకు ఫోన్లపై సర్వత్రా చర్చ
Published Tue, Nov 26 2013 3:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
రోడ్డు ప్రమాదంలో నవ వరుడు దుర్మరణం
ఏటా కోటి ఉద్యోగాల భర్తీ ఏమైంది?
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement