ఇన్ఫ్రాలో మరిన్ని పెట్టుబడులు
డిజిన్వెస్ట్మెంట్కు పీఎస్యూల లిస్టు సిద్ధం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ అధిక వృద్ధి సాధించాలంటే వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లు మరింత తగ్గగలవన్నారు. అయితే, తగ్గుదల ఎంత మేర ఉంటుందనే దానిపై నిర్ణయాధికారం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)దేనని బుధవారం ఇన్వెస్టర్లతో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. వచ్చే నెల 7న ఆర్బీఐ వార్షిక పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, కరెన్సీ మారక విలువల నియంత్రణను ఆర్బీఐ సమర్థంగా నిర్వహిస్తోందని, దీని గురించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని ఆరుణ్ జైట్లీ చెప్పారు.
జీఎస్టీకి త్వరలో మోక్షం..
మౌలిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులను మరింతగా పెంచనున్నట్లు తెలిపారు. వివిధ కారణాలతో 77 హైవే ప్రాజెక్టులు నిల్చిపోగా.. సమస్యలను పరిష్కరించడంతో 24 ప్రాజెక్టులు మళ్లీ పట్టాలపైకి ఎక్కాయని ఆయన చెప్పారు. తయారీ రంగానికి ఊతమిచ్చే దిశగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు. విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా అడ్డంకులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతో రక్షణ రంగంలోనూ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయని చెప్పారు. అలాగే వస్తు, సేవల పన్నుల విధానాన్ని (జీఎస్టీ) త్వరలో అమల్లోకి తేగలమని ఆయన తెలిపారు. ఇక, భూసేకరణ చట్టం గ్రామీణ ప్రాంతాలకు ప్రయోజనమే చేకూరుతుందని మంత్రి తెలిపారు.
2015-16 ఆర్థిక సంవత్సరంలో వాటాలను వ్యూహాత్మకంగా విక్రయించనున్న ప్రభుత్వ సంస్థల (పీఎస్యూ) జాబితాను కేంద్రం సిద్ధం చేసిందని జైట్లీ తెలిపారు. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ లక్ష్యాన్ని పూర్తిగా చేరుకోలేకపోయినప్పటికీ... గణాంకాల పరంగా భారీ స్థాయిలోనే డిజిన్వెస్ట్మెంట్ జరిగినట్లేనని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరింత భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. డిజిన్వెస్ట్మెంట్ జాబితాలో ఓఎన్జీసీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్), తదితర సంస్థలు ఉన్నాయి.
వడ్డీ రేట్లు మరింత తగ్గుతాయ్
Published Thu, Mar 26 2015 1:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement