36 మంది ఐఎస్ ఉగ్రవాదులకు ఉరి | Sakshi
Sakshi News home page

36 మంది ఐఎస్ ఉగ్రవాదులకు ఉరి

Published Sun, Aug 21 2016 4:15 PM

36 మంది ఐఎస్ ఉగ్రవాదులకు ఉరి

బాగ్దాద్: ఇరాక్లో 36 మంది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఉరిశిక్ష వేశారు. ఆదివారం ఉదయం దిఖార్ రాజధాని నసిరియా జైల్లో శిక్షను అమలు చేశారు.

రెండేళ్ల క్రితం టిక్రిట్ నగరంలో ఆర్మీ స్థావరంపై దాడిచేసి వందలాది సైనికులను కిరాతకంగా చంపిన ఘటనలో వీళ్లు దోషులుగా తేలారు. గతేడాది ఇరాక్ భద్రత దళాలు మళ్లీ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత సైనికుల అస్థిపంజరాలు బయటపడ్డాయి. భద్రత దళాలు జిహాదీలను బందీలుగా పట్టుకున్నారు. గత పిబ్రవరిలో వీళ్లకు మరణశిక్ష విధించారు. ఉరిశిక్షకు గురైన వారందరూ ఇరాక్ పౌరులుగా భావిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement