అలీగఢ్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోల్చడంపై హిందూవాదులే కాదు ఉదారవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైనా ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబిబ్ మాత్రం తన వ్యాఖ్యలపై వెనక్కితగ్గడం లేదు. ఐఎస్ఐఎస్లాగా ఆరెస్సెస్ కూడా మూర్ఖమైనదని ఆయన మరోసారి పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. 'ప్రజాస్వామిక విలువలను కాపాడాల్సింది ఉదారవాదులే కాదు.. అది అందరి బాధ్యత. లౌకిక విలువలను కాపాడటానికి దేశ ప్రజలందరూ ముందుకురావాలి. ప్రజాస్వామిక, లౌకిక విలువలను ప్రజలు కాపాడుకుంటున్నారని చెప్పడానికి ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలు సంకేతం' అని ఇర్ఫాన్ హబిబ్ తెలిపారు.
మతం పేరిట ఉగ్రవాద భావజాలాలు అనుసరించే వ్యక్తుల అజ్ఞానం నేపథ్యంలోనే తాను ఆరెస్సెస్ను ఐఎస్ఐఎస్తో పోల్చానని చెప్పారు. 'అజ్ఞానం, మూర్ఖత్వం విషయంలో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్ ఒక్కటే. 1947నాటి ఘటనలు విద్వేష నేరాల్లో ఆరెస్సెస్, ఐఎస్ఐఎస్ను అధిగమించిందని చాటుతాయి. భారత చరిత్రను ఆరెస్సెస్ తప్పుగా చిత్రిస్తుంది. అది దేశాన్ని కించపరుస్తుంది' అని ఆయన పేర్కొన్నారు.
'ఐఎస్ఐఎస్లాగే ఆరెస్సెస్ కూడా మూర్ఖమైనదే'
Published Wed, Nov 4 2015 9:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
Advertisement