తాను దేవుళ్లను పూజించనని బాలబంధు, నోబెల్ శాంతి పురస్కార విజేత కైలాష్ సత్యార్థి తెలిపారు. పిల్లలు దేవుళ్లకు ప్రతిరూపాలని చెప్పారు. వారి స్వేచ్ఛా, బాల్యాన్ని కాపాడడమే తన భక్తి మార్గమని వెల్లడించారు. తాను గత 40 ఏళ్లుగా ఆలయాలకు లేదా మసీదులకు వెళ్లలేదని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బాలలే తన బలమని అన్నారు. ఇంజినీరింగ్ కెరీర్ ను వదులుకున్నప్పుడు తన తల్లి కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే....
'నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోయారు. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నేను ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు ఆమె చాలా బాధపడింది. ఏదో ఒక రోజు నన్ను చూసి గర్వపడతావని అప్పుడు మా అమ్మతో చెప్పా. వ్యక్తిగతంగా ఆడంబరాలు, అవార్డులు, పురస్కారాలు నాకు ఇష్టం ఉండవు.
ఐక్యరాజ్యసమితి కంటే ముందుగా 1981లో బాలల హక్కుల కోసం గళం విప్పాను. 1989 నుంచి బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి దృష్టి సారించింది. ఈ విషయాలన్ని నోబెల్ కమిటీ పరిశీలించింది. నోబెల్ శాంతి పురస్కారంతో పాటు వచ్చే నగదు ఏవిధంగా ఖర్చు చేయాలనే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 400 మంది బాలలతో కూడిన బాల మహాపంచాయతీ నిర్ణయం మేరకు నిధులు ఖర్చుచేస్తాం. ప్రతిపైసా చిన్నారుల సంక్షేమం కోసం ఉపయోగపడాలన్నదే నా ఆకాంక్ష.
మేము కొత్తగా చేపట్టిన 'పీస్ ఫర్ చిల్డ్రన్' కార్యక్రమంలో చేరాలని నాతో కలిసి నోబెల్ శాంతి పురస్కారం గెల్చుకున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ ను ఆహ్వానించాను. భారత్, పాకిస్థాన్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడైనా చిన్నారులు శాంతియుత వాతావరణంలోనే పెరగాలి. మాలాలా అంటే నాకెంతో గౌరవం. పాకిస్థాన్ లో బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక పోరాటాలకు నేను మద్దతుపలికే నాటికి ఆమె ఇంకా పుట్టనేలేదు. 1987లో పాకిస్థాన్ సైన్యం నన్ను లాహోర్ వెలుపల మట్టుబెట్టాలని చూసింది. ఇటుక తయారీ కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా పాకిస్థాన్ సైనికులు వచ్చి నా తలపై తుపాకులు ఎక్కుపెట్టారు. నేను చిరునవ్వు నవ్వాను. కొన్ని నిమిషాలు ఆగితే నా ప్రసంగం పూర్తవుతుంది తర్వాత నన్ను చంపండి అని సమాధానమిచ్చాను.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని భావిస్తున్నాం. టీ అమ్మే స్థాయిని నుంచి దేశానికి ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగానని మోడీ చెబుతున్నారు. ఇక ఏ చిన్నారి బాలకార్మికుడిగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ప్రతి కుర్రాడు దేశ ప్రధాని కాలేడు. కానీ ప్రతి పిల్లాడు స్కూల్ కు వెళ్లగలడు. మంచి విద్య పొందగలడు' అని కైలాష్ సత్యార్థి అన్నారు.
'40 ఏళ్లుగా గుడికెళ్లడం లేదు'
Published Tue, Oct 14 2014 5:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement