సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులకు రీడిజైన్ చేయడానికంటే ముందు సమగ్రంగా అధ్యయనం చేయాలని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి హితవు పలికారు. గోదావరి నదిపై ఎక్కువగా బ్యారేజీలను నిర్మించాలన్నారు. దీనివల్ల ముంపు, ఖర్చు కూడా తక్కువ అవుతుందన్నారు. ఇతర రాష్ట్రాలతో ముంపు సమస్య కూడా ఉండదని చెప్పారు. రిటైర్డు చీఫ్ ఇంజనీరు హనుమంతరావు, నీటి పారుదలరంగ నిపుణుల సూచనలను ప్రభుత్వం అమలుచేయాలని సూచించారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డితో కలసి సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
పాలమూరు ఎత్తిపోతలకు నికర జలాలు లేవంటున్నా నిర్మించాలని తలపెడుతున్నారని, వీటికి వేల కోట్లు ఖర్చుచేసినా ఫలితాలు రావన్నారు. ఇప్పటికే 80 శాతం పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను సత్వరమే పూర్తిచేయాలని జానారెడ్డి కోరారు. రైతుల పొలాల్లో కందకాలు తవ్వడం ద్వారా నీటిని నిల్వ చేయడం, భూగర్భజలాలను పెంచుకోవడం వంటివి చేయాలని సూచించారు. దీనిపై పైలట్ ప్రాజెక్టు కింద రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. రాజకీయాలను కలుషితం చేసేలా తాను ఏనాడూ మాట్లాడలేదన్నారు. మంత్రి హరీశ్రావు సవాల్పై స్పందించబోనని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేవిధంగా రాజకీయాల్లో వ్యవహరించాలన్నారు.
రూ. 5 భోజనం బాగుంది
జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన రూ. 5కే భోజనపథకం బాగుందని జానారెడ్డి ప్రశంసించారు. ఇటీవల ఈ పథకంపై విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భోజనం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆయన ఆసక్తి చూపారు. సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన జానారెడ్డి 4 ప్లేట్ల భోజనాన్ని తెప్పించారు. ఆయనతోపాటు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ భోజనాన్ని రుచి చూశారు. కాగా.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు.
అధ్యయనం తర్వాతే రీడిజైన్
Published Fri, Jan 29 2016 2:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement