సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం ఈ తీర్మానాలను ఆమోదించిన అసెంబ్లీ, మండలి 29వ తేదీకి వాయిదాపడ్డాయి.
శాసనసభలో ఉదయం సభ ప్రారంభం కాగానే కలాం మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కలాం సేవలను కేసీఆర్ కొనియాడారు. ‘‘నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్రపతి పదవిని అధిరోహించిన మేధావి కలాం. నిరంతరం దేశ ప్రయోజనాల కోసం పనిచేశారు. హైదరాబాద్తో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. డీఆర్డీఎల్కు కలాం పేరు పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రానికి సూచించాను.
ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తునా..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ భద్రతకు కలాం చేసిన సేవలు ఎనలేనివని కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన జీవితం నుంచి అందరూ స్ఫూర్తి పొందాలన్నారు. కలాం స్ఫూర్తితో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. కలాం మరణం యావత్జాతికి తీరని లోటని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు.
మహోన్నత వ్యక్తిత్వంతో అందరినీ కదిలించిన కలాం పేరును డీఆర్డీఎల్కు మాత్రమే పరిమితం చేయకుండా మెట్రోరైలుకు కూడా పెట్టి హైదరాబాద్తో ఉన్న అనుబంధాన్ని శాశ్వతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత పాయం వెంకటేశ్వర్లు సూచించారు. ఏదైనా యూనివర్సిటీకి కలాం పేరు పెట్టాలని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ కోరారు. మంత్రి ఈటల, ఉపసభాపతి పద్మాదేవేందర్రెడ్డి, టీఆర్ఎస్ సభ్యులు రసమయి బాలకిషన్, శ్రీనివాస్గౌడ్, కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, సంపత్కుమార్, రాజేందర్రెడ్డి (టీడీపీ), కిషన్రెడ్డి (బీజేపీ), పాషాఖాద్రి (మజ్లిస్), సున్నం రాజయ్య (సీపీఎం) తదితరులు కలాం సేవలను కొనియాడారు.
కలాం మృతిపట్ల శాసనమండలిలో సంతాప తీర్మానాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. విద్యార్థులు, యువతకు, అన్ని రంగాల వారికి కలాం స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ రూపకల్పనలో, పృథ్వీ, అగ్ని క్షిపణులు, పోఖ్రాన్ అణుపరీక్షల నిర్వహణలో కలాం కీలకపాత్రను పోషించారని మండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. హైదరాబాద్ ఎంతో అనుబంధమున్న కలాం పేరును ఏదైనా కొత్తగా స్థాపించే ఐఐటీ, ఐఐఐటీ వంటి సంస్థకు పెట్టాలని విపక్షనేత షబ్బీర్అలీ సూచించారు. భారతజాతికి గొప్ప అదృష్టంగా కలామ్ లభించారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సయ్యద్ అమీన్ జాఫ్రీ (ఎంఐఎం), రామచంద్రరావు (బీజేపీ), పొంగులేటి సుధాకర్రెడ్డి (కాంగ్రెస్) తదితరులు కలాం సేవలను కొనియాడారు.
కలాం, కిష్టారెడ్డిలకు నివాళి
Published Thu, Sep 24 2015 1:23 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement