రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు:కేసీఆర్ | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారు:కేసీఆర్

Published Thu, Feb 6 2014 7:28 PM

kcr meets pranab mukherjee

ఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. గురువారం రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన ప్రక్రియనె త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్రపతిని కోరినట్లు కేసీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి సానుకూలంగా స్పందిచారన్నారు.  శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ పలువురు జాతీయ నేతల్ని కలిశారు. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ ను, బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరించారు.

Advertisement
Advertisement