విద్యార్థి ప్రాణం తీసిన చెట్టు | Sakshi
Sakshi News home page

విద్యార్థి ప్రాణం తీసిన చెట్టు

Published Wed, Jul 8 2015 6:20 PM

Kerala student killed by falling coconut tree

కోజికోడ్: కొబ్బరి చెట్టు కూలిపోయి మీద పడడంతో ఆరో తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన కేరళలోని చోటుచేసుకుంది. కోజికోడ్ జిల్లాలోని మీనచంతా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. బలమైన గాలులు వీయడంతో కొబ్బరిచెట్టు కూలి ఆడుకుంటున్న విద్యార్థులపై పడింది. ఈ ఘటనలో షిజిల్ అహ్మద్ అనే విద్యార్థి మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.

పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశించారు. ఎర్నాకులం జిల్లా కొత్తమంగళంలో గతనెలలో స్కూల్ బస్సుపై చెట్టుపడి ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement