- 30 మందిని చంపేశాం: ఉగ్రనాయకుడు హఫీజ్ సయీద్
- అది తప్పు, చనిపోయింది ముగ్గురే: ఇండియన్ ఆర్మీ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా, జమ్ముకశ్మీర్లోని అఖ్నూర్ ఆర్మీ క్యాంపుపై నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు దాడి చేశారని, మొత్తం 30 మంది సైనికులను చంపేసి, సురక్షితంగా తప్పించుకున్నారని టెర్రరిస్టు నాయకుడు హఫీజ్ సయీద్ చెప్పుకున్నాడు. అయితే భారత సైన్యం మాత్రం ఆ ప్రకటనను ఖండించింది. హఫీజ్ చెప్పినట్లు కాక, వేరొక ఘటనలో ముగ్గురు కూలీలు చనిపోయారని వివరణ ఇచ్చింది.
ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉల్ దవా ఉగ్రవాద సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్ బుధవారం ముజఫరాబాద్లో ఒక సభ నిర్వహించాడు. ఆ ప్రసంగం తాలూకు ఆడియోను పలు వార్తా సంస్థలు ప్రసారం చెయ్యడంతో దుమారం చెలరేగింది. పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ బూటకమని, ఈ విషయంలో మోదీ సర్కారు ప్రపంచాన్ని మోసం చేసిందని హఫీజ్ ఆరోపించాడు. ‘అసలైన సర్జికల్ స్ట్రైక్ ఎలా ఉంటుందో మన ముజాహిద్దీన్లు(ఉగ్రవాదులు) మొన్ననే(సోమవారం) ఇండియాకు రుచి చూపించారు. అఖ్నూర్ ఆర్మీపై మెరుపుదాడిచేసి, 30 మంది సైనికుల్ని చంపేసి, చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా తిరిగొచ్చారు’అని ఆడియోలో హఫీజ్ అన్నాడు.
అసలేం జరిగిందంటే..
హఫీజ్ వ్యాఖ్యలను ఖండించిన భారత సైన్యాధికారులు ఆ రోజు ఏం జరిగిందో మీడియాకు వివరించారు. ‘పాక్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలో జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్(డీఆర్ఈఎఫ్) క్యాంపుపై సోమవారం ఉగ్రవాదులు దాడిచేశారు. ఆ సమయంలో అక్కడ 10 మంది సిబ్బంది, మరో 10 మంది కూలీలు ఇంజనీరింగ్ పనులు చేస్తున్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు డీఆర్ఈఎఫ్ కూలీలు చనిపోగా, మిగిలినవారు సురక్షితంగా బయటపడ్డారు. హఫీజ్ చెప్పుకున్నట్లు 30 మంది చనిపోవడంగానీ, ఆర్మీ క్యాంపుపై దాడిగానీ జరగలేదు’ అని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
ఉగ్రదాడి: భారీ సంఖ్యలో భారత సైనికుల మృతి!
Published Fri, Jan 13 2017 12:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement