ముంబై: అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయ్ మాల్యా యూబీ గ్రూప్పై బ్యాంకులు కొరడా ఝులిపిస్తున్నాయి. బకాయిల వసూలు చర్యల్లో భాగంగా కింగ్ఫిషర్ హౌస్ను మంగళవారం స్వాధీనం చేసుకున్నాయి ఎస్బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ మేరకు చర్యలు తీసుకుంది. దీని విలువ రూ.100 కోట్లుగా అంచనా. మూతబడిన మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నుంచి దాదాపు 20 బ్యాంకులకు మొత్తం రూ.6,800 కోట్ల మేర రుణ బకాయిలు(వడ్డీ కాకుండా) రావాల్సి ఉంది. దీనికోసం కొన్ని బ్యాంకులు ఆయనపై ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారు ముద్రను కూడా వేయడం.. మాల్యా దీన్ని సవాలు చేయడం జరిగాయి.
కింగ్షిషర్ ఎయిర్లైన్స్కు అతిపెద్ద ఆస్తుల్లో ఒకటైన కింగ్ఫిషర్ హౌస్ విస్తీర్ణం 17,000 చదరపు అడుగులు. ఇది ఇక్కడి దేశీ ఎయిర్పోర్ట్ టెర్మినల్కు దగ్గర్లోని విలే పార్లేవద్ద ఉంది. యూబీ గ్రూప్లో కీలక కంపెనీగా వెలుగొందిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూసివేత తర్వాత బ్యాంకులు 2013 ఫిబ్రవరిలోనే బకాయిల రికవరీ ప్రక్రియకు తెరతీశాయి. 2012 అక్టోబర్లో ఎయిర్లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. అదే ఏడాది డిసెంబర్లో ప్లయింగ్ లెసైన్స్ కూడా రద్దయింది. కాగా, తమ రుణదాతలకు కన్సార్షియంగా వ్యవహరిస్తున్న ఎస్బీఐక్యాప్ ట్రస్టీకి కింగ్ఫిషర్ హౌస్ ప్రాపర్టీని స్వాధీనం చేసినట్లు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా, కింగ్ఫిషర్ హౌస్ స్వాధీనాన్ని ఎస్బీఐ డిప్యూటీ ఎండీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్(మొండిబకాయిల నిర్వహణ) ప్రవీణ్ కుమార్ మల్హోత్రా ధ్రువీకరించారు. ఇదే ప్రాపర్టీని ఆదాయ పన్ను, సేవల పన్ను విభాగాలు కూడా తమ బకాయిల వసూలుకోసం జప్తు చేసిన విషయంపై మల్హోత్రా మాట్లాడుతూ.. సంబంధిత పన్నుల విభాగాలతో చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం ఉంటుందని చెప్పారు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రూ.350 కోట్లు బకాయిపడిందని.. ఐటీ చట్టం కింద కింగ్ఫిషర్ హౌస్ను అటాచ్ కూడా చేసిన నేపథ్యంలో తమ బకాయిలను ముందుగా సెటిల్ చేసిన తర్వాతే ఈ బిల్డింగ్ను స్వాధీనం చేసుకునేందుకు ముందుకెళ్లేలా బ్యాంకులను ఆదేశించాలంటూ ఐటీ శాఖ 2013 డిసెంబర్లో బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది.
కింగ్ఫిషర్ హౌస్ స్వాధీనం
Published Wed, Feb 25 2015 12:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పేదల అక్షరంపై కక్ష
పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు
కాంగ్రెస్లో కౌన్సిలర్ల చేరిక
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
‘మరోసారి ప్రధానిగా మోదీ’
ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు
గ్రీన్బక్కెట్ పార్శిల్ హోటల్లో చోరీ
‘కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను గెలిపించాలి’
ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు
నేతకాని కార్పొరేషన్ కాంగ్రెస్తోనే సాధ్యం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement