కేఎస్ ఆర్‌టీసీ బస్సుకు మంటలు | Sakshi
Sakshi News home page

కేఎస్ ఆర్‌టీసీ బస్సుకు మంటలు

Published Fri, Nov 8 2013 2:32 AM

కేఎస్ ఆర్‌టీసీ బస్సుకు మంటలు - Sakshi

బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక రాష్ట్ర(కేఎస్) ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపా రు. వివరాలు.. హాసన్ ప్రాంతం నుంచి కర్ణాటక వైభవ బస్సు(కేఏ-13 ఎఫ్ 1949) 30 మందితో గురువారం బెంగళూరుకు బయలుదేరింది. సాయంత్రం 5.45 గంటల సమయంలో బెంగళూరు-తుమకూరు రోడ్డులోని గురగుంటపాళ్య సిగ్నల్ సమీపంలో బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. వారు బస్సు దిగిపోయారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement