ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ లగడపాటి | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ లగడపాటి

Published Tue, Oct 8 2013 12:47 PM

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ లగడపాటి - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను చేసిన రాజీనామాను లోక్సభ స్పీకర్ ఇప్పటి వరకు ఆమోదించలేదు, ఆ అంశంలో జోక్యం చేసుకోవాలని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మంగళవారం న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అందుకు సంబంధించి పిటిషన్ కోర్టులో దాఖలు చేశారు.

రాష్ట్ర విభజనపై తీవ్ర మనస్తాపం చెందిన తాను 60 రోజులు క్రితం రాజీనామా చేశారు. తన రాజీనామాపై ఇప్పటి వరకు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన న్యూఢిల్లీ హైకోర్టును కోరారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో లోక్సభ స్పీకర్ను లగడపాటి ప్రతివాదిగా చేర్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement