అన్నదాతకు అందని రుణాలు
వడ్డీ కట్టించుకుని పునరుద్ధరణతోనే సరి
వాణిజ్య బ్యాంకుల్లో కొనసాగుతున్న తంతు
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడంతోనే ఇబ్బంది
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడంతో రైతులపై వడ్డీ భారం పడుతోంది. మరో పక్క రాష్ట్రంలోని వాణిజ్య బ్యాంకులన్నీ వడ్డీ కట్టించుకుని రుణాలను రెన్యువల్ చేసి పంపించేస్తున్నాయి. కొత్తగా పైసా మంజూరు చేయడం లేదు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచకపోవడమే. అంటే.. పంటల వారీ ఏటా పెంచే రుణపరిమితిని ఈ ఏడాది పెంచలేదు.ఇలా రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాతలను వడ్డీ వ్యాపారుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ఇచ్చిన నిధులు ఆయా రైతుల అప్పులపై వడ్డీ చెల్లింపునకూ సరిపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో మాఫీ పేరుతో ఇచ్చిన 20 శాతం నిధులు ఆయా రైతుల అప్పులపై ఉన్న వడ్డీకిసరిపోలేదు. దీంతో ఆయా రైతుల రుణాలు గత ఖరీఫ్ సీజన్లో రెన్యువల్ కాలేదు. ఈ ఖరీఫ్లోనైనా వడ్డీలు చెల్లించి రుణాలను రీ షెడ్యూల్ చేసుకోవాలని, లేదంటే 18 శాతం వరకు వడ్డీ భారం పడుతోందంటూ బ్యాంకర్లు రైతులకు చెబుతున్నారు. రైతులు వడ్డీలు చెల్లించడానికి ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
సహకార బ్యాంకుల్లోనూ అదే పరిస్థితి
సన్న, చిన్న కారు రైతులకు ప్రాథమిక సహకార బ్యాంకుల నుంచీ రుణం మంజూరు కావడం లేదు. నాబార్డు ఆప్కాబ్కు రుణం మంజూరు చేస్తేనే ఆప్కాబ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు ఆ నిధులను ఇస్తుంది. జిల్లా సహకార బ్యాంకులు ఆ నిధులను ప్రాథమిక సహకార బ్యాంకులకు అందజేస్తాయి. వాటిని ప్రాథమిక సహకార బ్యాంకులు రైతులకు రుణంగా ఇస్తాయి. నాబార్డు రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి దీనికి 0.05 శాతం ఆప్కాబ్ కమిషన్గా ఇవ్వాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.ఆర్థిక స్తోమత లేదని, కమిషన్ లేకుండా గ్యారెంటీ ఇవ్వాల్సిందిగా ఆప్కాబ్ కోరినప్పటికీ ఆర్థిక శాఖ కరుణించడం లేదు.
.
ప్రైవేట్ రుణమే దిక్కు
Published Mon, Jul 13 2015 12:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
బాబును చీల్చి చెండాడిన మహిళలు
కేరళలో ‘వెస్ట్ నైల్’ వైరస్ కేసులు
ఓటు తో కొట్టే దెబ్బకు ఢిల్లీ పీఠం కదలాలి..
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement